మన్యం టీవీ : జూలూరుపాడు,
జూలై 19, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం గ్రామంలో జంపాల వాసుదేవ్(46) అనే వ్యక్తి పది రోజుల క్రితం జూలూరుపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు కరోనా పరీక్ష చేపించుకో గా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఓం ఐసోలేషన్ లో ఉంటూ మెడిసిన్ వాడమని వైద్యులు మెడికల్ కిట్ అందజేశారు. నాలుగు రోజులపాటు ఓం ఐసోలేషన్ లో ఉంటూ మందులు వాడుతుండగా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తడంతో కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాల కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. చేతి వృత్తి పై కుటుంబాన్ని పోషించే వ్యక్తి అకాల మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో పడింది. మృతుడికి భార్య కుమారుడు ఉన్నారు.
Post A Comment: