పీ వై ఎల్ రాష్ట్ర నాయకులు వాంకుడోత్ అజయ్
గుండాల జూలై 18 (మన్యం మనుగడడ) ఈనెల 26వ తారీఖున తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీ వై ఎల్ రాష్ట్ర నాయకులు వాంకుడోత్ అజయ్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. హైదరాబాదులో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నిరుద్యోగ సమస్యపై జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చింది అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ ఉద్యోగ నియామకాలు చేపట్ట లేదన్నారు. నిరుద్యోగ రైతాంగ సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల మాజీ సర్పంచ్ కోరం శాంతయ్య, పీ వై ఎల్ అధ్యక్ష కార్యదర్శులు ఈ సం కృష్ణ , ఎనుగంటి గణేష్ , నాయకులు కోడూరి జగన్, ముక్తి జనార్ధన్, కృష్ణ , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: