*చోద్యం చూస్తున్న అధికారులు
*అట్టి ఫారెస్ట్ భూమిని పత్రిక విలేకరులకు కేటాయించాలి
*టిఎంఎంఎన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ నిమ్మగడ్డ ప్రవీణ్
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని రాజుపేట రమణక్కపేట గ్రామల మద్య ఉన్న పాత ఫారెస్ట్ భవనం స్థలం ఆక్రమణకు గురవుతున్న ఫారెస్ట్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలను కలిగిస్తుందని అట్టి ఫారెస్ట్ భూమిని అక్రమణకు గురి కాకుండ వెంటనే అటవీ అధికారులు స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ మాల మహా నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మగడ్డ ప్రవీణ్ అన్నారు.అట్టి ఫారెస్ట్ భూమిని మండల పత్రిక విలేకరులకు ఇంటి స్థలాలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం పత్రిక విలేకరులకు ఇంటి స్థలాలు ఇస్తానన్నా స్థలాలు లేక కేటాయింపు జరగడం లేదు కనుక ఇంటి స్థలాన్ని ప్రభుత్వ అధికారులు గుర్తించి పత్రిక విలేకరులకు కేటాయించి విలేకరుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు.ఎంతో మంది అనధికార వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమించు కుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆక్రమణకు గురికాగా ఉన్న కొంత భూమిని అయినా మంగపేట మండల పత్రిక విలేకరులకు కేటాయింపు జరపాలని తెలంగాణ మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మగడ్డ ప్రవీణ్ పత్రిక ప్రకటన ద్వార తెలియజేశారు.
Post A Comment: