మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శాసనసభ్యులు పిసిసి జిల్లా అధ్యక్షులు పోదేం వీరయ్య ఆదేశాల మేరకు సిఎల్పి నాయకులు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఇల్లందు నియోజక వర్గ ఇంచార్జ్ చీమల వెంకటేశ్వర్లు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇల్లందు మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఆ పార్టీ మండల అధ్యక్షుడు పులి సైదులు తెలిపారు. ఈ మేరకు పులి సైదులు మాట్లాడుతూ. . వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎట్టి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి పి శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజర్గా ధనసరి పగిడిద్దరాజు, కొర్ర రమేష్, కార్యదర్శి ఈసం రమేష్, ట్రెజరర్ బర్ల రామ్మూర్తి, సహాయ కార్యదర్శిగా ఇస్లావత్ సతీష్, ఎలుకపల్లి కోటేశ్వరరావు, నిట్ట రాంబాబు, మూతి ముత్యాలు, బోడ రమేష్, చీమల లక్ష్మీనారాయణ, మందంగల శ్రీను, బానోత్ రమేష్, సనప వీరభద్రం, బీసీ సెల్ మండల అధ్యక్షులుగా గడదాసు వెంకటేశ్వర్లు, ఎస్ టి సెల్ మండల అధ్యక్షుడు గా అగ్ని రవి లను నియమించడం జరిగినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Post A Comment: