మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం ఎక్సైరోడ్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో మండల అధ్యక్షుడు గొడిశాల రామనాధం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలన అభివృద్ధి అనేది గ్రామాల్లో చాలా వెనుకబడి పోయింది అని ప్రభుత్వం ఎప్పుడు మేము అది చేసాం ఇది చేసాం డప్పాలు కొట్టుకోవడం తప్ప ఇప్పటివరకు ప్రభుత్వం చేసింది ఒరిగింది ఏమి లేదు.
పినపాక మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ రోడ్లన్ని ఎంత అమానుషంగా ఉన్నాయో రోడ్ల మీద బండ్లు పోవాలి అంటే భయం గుప్పిట్లో పెట్టుకొనే పరిస్థితికి వచ్చింది.బండి నడిపాలి అంటే ఎక్కడ పడిపోతాం అనే భయం దాని కన్నా నడుచుకుంటూ పోవడమే ఉత్తమం అసలు గామాల్లో తిరుగుతే కదా తెలిసేది గ్రామ పంచాయతీలు ఎలా ఉన్నాయో తెలిసేది బహుశా తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతుంది అనుకుంట ,ఇక్కడ నియమించ బడ్డ ప్రజాప్రతినిధులు సైతం గాఢ నిద్రలో వున్నారు అనుకుంటా. మీకు చేతకాకపోతే రాజీనామాలు చేయండి.
,ప్రభుత్వం గ్రామాలకు చేపట్టిన నిధులు
ఆనాడు పల్లెసీమ అభివృద్ధి తోనే రాష్టం అభివృద్ధి చెందుతుంది అని వివిధ పథకాల బడ్జెట్ కేటాయించింది.2020-2021 బడ్జెట్లో ఏప్రిల్ నాటికి 800 కోట్లతో 10758 గ్రామపంచాయతీలకు సి.సి రోడ్ల మంజూరు చేసింది అని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. మరి ఆ నిధులు ఏమైనట్టు ఎవరి కతాలో జమ అయినట్టు ఇంకా ఆ దేవుడేకె తెలియాలి. యిప్పటికైనా కళ్లు తెరవండి అని ఆయన అన్నారు.
మేము ఈరోజు నుండి గ్రామాలకు , కార్యకర్తలందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ తరపున చందాలు వేసుకుని ఎక్కడ నిర్మాణం లేని రోడ్లను నిర్మాణాలు చేయుటకు కాంగ్రెస్ పార్టీ పూర్తి బాద్యత వహిస్తాము.ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలని అని ఆయన అన్నారు .ఈ సమావేశంలో మండల కమిటీ పాల్గొన్నారు.
Post A Comment: