👉ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి* మన్యం టీవీ,ములకలపల్లి మండలం : భద్రాచలం ఐ.టి.డి.ఏ-పి.ఓ-గౌతమ్ పోట్రు(ఐఏఎస్)కు, ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన సమస్యలపై వినతి పత్రాన్ని, సమర్పించారు. ములకలపల్లి మండలంలోని పొగళ్లపల్లి, మొగరాలగుప్ప గ్రామాలలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు,మొదటి విడతలో లబ్దిదారులను ఎంపిక చేసినప్పటికీ, ఇంతవరుకు ఇళ్లు ఇవ్వలేదని. ఈ వర్షాకాల సమయంలో నిరుపేద అదివాసీ గిరిజనులు,సరైన గూడు లేక ఇబ్బందులు పడుతున్నారని. ఇప్పటికైనా లబ్ది దారులకు వెంటనే ఇల్లు ఇవ్వాలని జడ్పిటిసి సున్నం నాగమణి. ఐటీడీఏ-పిఓ దృష్టికి తీసుకొని వెళ్లగా, పి.ఓ సానుకూలంగ స్పంధించి, సంబందించిన అధికారులకు అదేశాలు జారీ చేసినట్లు తెలియజేశారు.
Post A Comment: