మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు రోటరీ క్లబ్ అధ్యక్షులుగా స్వాతి ప్రింటర్స్ అధినేత ఆకుల మల్లిఖార్జునరావు ను సభ్యులు ఎన్నుకున్నారు. నేటి నుండి ఏడాదిపాటు అధ్యక్షులుగా కొనసాగనున్న మల్లిఖార్జునరావు మాట్లాడుతూ సమాజ సేవలో ముందుండే రోటరీ క్లబ్ అధ్యక్షుని గా ఎన్నుకున్నానందు కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికైన తొలిరోజే సమాజ సేవలో ముందుండే వైద్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.సేవలో రోటరీ క్లబ్ ను ముందుండేలా ప్రయత్నిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి సందా మధు,రోటరీ క్లబ్ ట్రైనీ యూసఫ్,సభ్యులు ఎం.వెంకట్,జె.వి.ఎస్ చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.
Post A Comment: