చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : చండ్రుగొండ మండలం లో ప్రభుత్వ నిషేధిత గుట్కా లను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ కృష్ణారావు అన్నారు .బుధవారం చండ్రుగొండ ప్రధాన సెంటర్ లోని దుకాణాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిషేధిత గుట్కా ల కోసం ఆయన విస్తృతంగా తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుట్కాలు అమ్మిన ,సరఫరా చేసిన చట్టరీత్యా నేరం అవుతుందన్నారు.గ్రామంలో ఎవరైనా అనుమానితులు తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట పోలీస్ సిబ్బంది శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు .
Navigation
Post A Comment: