CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మానవత్వం పరిమళించిన వేళ

Share it:

 


పోడు సమస్యతో ఆత్మహత్య చేసుకున్న మల్లారం ఆదివాసి 

దహన ఖర్చులకు 10,000 ఆర్థిక సహాయం అందించిన పినపాక తహసిల్దార్


మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామ పంచాయతీకి సంబంధించిన వలస ఆదివాసి కుంజా సురేష్, పోడు సమస్య కారణంగా, పురుగుల మందు సేవించి సోమవారం సాయంత్రం మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ విక్రమ్ కుమార్ సురేష్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేశారు.మృతునికి భార్య నలుగురు పిల్లలు ఉన్నారు అనే విషయం తెలుసుకున్న తాసిల్దార్ ఆర్థిక పరిస్థితి బాగా లేదని అర్థం చేసుకుని దహన సంస్కారాల కోసమని పదివేల రూపాయలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.తహసిల్దార్ దాతృత్వం గురించి మండలంలోని అధికారులు ప్రజలు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్ల బయ్యారం సబ్ ఇన్స్పెక్టర్ టి వి ఆర్ సూరి, ఆదివాసీలు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: