మన్యం మనుగడ, పినపాక:
మండలంలోని తోగ్గుడెం గ్రామానికి చెందిన గాందర్ల సాయి కుమార్ అనే యువకుడు ఈ నెల 9న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతునికి భార్య గిరిజ ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఆర్థికంగా వెనకబడిన ఆ కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ చింతపాటి సత్యం, టిఆర్ఎస్ మండల బీసీ సంఘం నేత ఎగ్గడి శ్రీ రామ్, పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు సాగర్ యాదవ్, పినపాక ప్రెస్ క్లబ్ తరపున ఆ కుటుంబానికి దశదిన కర్మలకు గాను 7400, బియ్యం గురువారం అందించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వుదయం ప్రతినిధి భోగ ఓదెలు గుండు నరసింహమూర్తి, నిమ్మ లింగారెడ్డి, గుమాసు శంకర్, గొడిశాల చంద్రం, యోగి, దిలీప్, సంతోష్ ,నాగేష్, కన్నె రమేష్, రాజు, శేఖర్ బాబు,డా.రాజు,బండ మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: