ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల నరసింహారావు డిమాండ్..
మన్యం టీవీ : జూలూరుపాడు,
జూలై 14, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అర్హులైన ఫోటోగ్రాఫర్లకు కెమెరాలు కొనుగోలు చేసి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు మంజూరు చేయాలని, ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల నరసింహా రావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎల్లంకి గార్డెన్ లో బుధవారం జరిగిన ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ ల సంఘం మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడినారు. ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ లంతా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ లు అంతా కలిసి హక్కుల సాధన కోసం కలిసికట్టుగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మారుతీ ప్రకాష్ రావు, జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు మైలవరం రామకృష్ణ, జిల్లా కోశాధికారి దుబాయ్ రామకృష్ణ, జిల్లా కన్వీనర్ రవికుమార్, జిల్లా నాయకులు రాజేష్, సహాయ కార్యదర్శి చింతల చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షులు పాలెపు సత్యనారాయణ, జిల్లా ఎన్నికల అధికారి అనిల్ కుమార్, మండల ఎన్నికల అధికారి గుండా సత్యనారాయణ, అనుమల భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: