నిరుపేద కుటుంబానికి బియ్య,నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన రేగా సైన్యం సభ్యులు
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణం లోని రాజపేట యూత్ ప్రెసిడెంట్ బానోత్ రమేష్ నాయక్ మణుగూరు రైల్వేస్టేషన్ ఏరియా న్యూ పద్మగూడెం గ్రామం లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న గూగులోత్.లక్ష్మి కి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు గురువారం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి 25 కేజీల బియ్యం,నిత్యావసర వస్తువుల ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రేగా సైన్యం సభ్యులు, పినపాక నియోజకవర్గ యువజన నాయకులు పద్దం.శ్రీనివాస్,గుర్రం.సృజన్,పద్దం.నరసింహారావు,వనమాల సాయి ప్రకాష్,పద్ధం. నవీన్,సతీష్,కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: