మన్యంటీవీ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం మేజర్ గ్రామ పంచాయతీ మొదటి సెగ్మెంట్ పరిధిలో గల నాలుగు వార్డులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా ప్రవేశపెట్టిన పల్లెప్రగతిలో భాగంగా శనివారం ప్రతి ఇంటికి మొక్కల పంపకం జరిగింది. ఈ కార్యక్రమం లో సెగ్మెంట్ ఎంపీటీసీ వేముల భారతి, ఈఓ గజవల్లి హరికృష్ణ మొక్కలను పంపిణి చేసారు. అనంతరం భారతి మాట్లాడుతూ పంచాయితీ పరిధిలోని ప్రతి ఇల్లు ఒక అందమైన ఉద్యానవనముగా ఉండాలనే ధ్యేయం తో అనుక్షణం పంచాయితీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న సర్పంచ్ రమ్య మరియు ఈఓ హరికృష్ణకు పారిశుధ్య కార్మికులకు పంచాయితీ సిబ్బందికి ధన్యవాదములు తెలియ జేశారు. ఈ కార్యక్రమం లో వీరితో పాటు బిల్ కలెక్టర్ ఏ నాగేందర్ రావు, కిరణ్, మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: