👉మరో ఇద్దరికి అస్వస్థత
👉 భగీరథ ప్లాంట్అధికారుల నిర్లక్ష్యం పట్ల మండల ప్రజలు ఆగ్రహం
మన్యం మనుగడ, దుమ్ముగూడెం:ఇటీవల జరిగిన క్లోరిన్ లిక్విడ్ సంఘటన మర్వకముందే మంగళవారం రాత్రి 9 గంటలకు సీతానగరం గ్రామానికి చెందిన కళ్యాణ్ , లింగమ్మ లు ప్లాంట్ మొత్తం శుభ్రం చేశారు.ఈ క్రమంలో క్లోరిన్ లిక్విడ్ పీల్చడం వలన నీరసంగా, ఊపిరిసరిగా రాకపోవడంతో హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్ తరలించారు .పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి 108 వాహనం లో తరలించారు .ఈ సంఘటన జరిగిన హాస్పిటల్ కి సంబంధిత ఏ ఒక్క అధికారి రాలేదు. గ్యాస్ లీకై ప్రాణ భయంతో ప్రజలు గజగజ వణుకుతున్నాయి సంబంధిత శాఖ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా గ్యాస్ లీక్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరారు.
Post A Comment: