మన్యం మనుగడ, కరకగూడెం:
కరకగూడెం మండలం సీతారాంపురం గ్రామం నుండి వెంకటాపురం, దేవర్ నాగారం గ్రామాలకు వెళ్లే రహదారి గత సంవత్సరం వర్షాల కారణంగా దెబ్బతిని, గుంతలు పడి సరిగ్గా లేకపోవడంతో గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు & ఏ బ్లాక్ కోఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆరోపించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... గుంతలు ఏర్పడి వర్షకాలంలో నీరు నిలిచి రోడ్లు బురద నీటితో గుంతలు కనపడకుండా ఉండి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.కావున స్థానిక అధికారులు ఇటువంటి రహదారులపై దృష్టిసారించి రహదారులను బాగు చేయాలని కోరారు.
Post A Comment: