టీ పీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి నీ హైదరాబాదులో తన నివాసంలో శుక్రవారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డి తో కేశవరెడ్డి మాట్లాడి జిల్లా కాంగ్రెస్ పార్టీ స్థితిగతుల పై చర్చించడం జరిగింది. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినా మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. త్వరలో జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు కేశవరెడ్డి తెలిపారు.
Post A Comment: