మొక్కలు నాటిన టిఆర్ఎస్ పార్టీ జెడ్ పి టి సి ఎంపీపీ
గుండాల ఆళ్ల పల్లి జూలై 24(మన్యం మనుగడ) రేగా పిలుపుతో ఆళ్ల పల్లి మండలంలో అనూహ్య స్పందన వచ్చింది. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా భారీగా మొక్కలు నాటాలని పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునివ్వడంతో ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు మొక్కలు నాటారు. రామంజి గూడెం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మొక్కలు నాటారు. ముక్కోటి వృక్ష అర్చన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి కొమరం హనుమంతు, ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, సర్పంచ్ నిర్మల, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయల్ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి బాబా, ఉపాధ్యక్షులు వేమూరి సత్యం, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: