మన్యం మనుగడ, కరకగూడెం:
కరకగూడెం ప్రాథమిక కేంద్రం పరిధిలోని నిమ్మగూడెం గోత్తికోయ గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు మండల వైద్యాధికారి పర్షియా నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా 53 మందిని పరీక్షించడం జరిగిందని, 9మంది జ్వర పీడిత నుండి రక్తనమూనాలు సేకరించడం జరిగిందన్నారు. అలజీబ్గర్భిణీ స్త్రీలను పరీక్షించడం జరిగిందన్నారు. ఫ్రైడే డ్రైడే లో భాగంగా నిల్వ ఉన్న నీటిని పడబోయడం జరిగింది, పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత మరియు కాచి వడబోచిన నీటిని తాగాలని వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో డా.పర్షియా నాయక్, డా.అను, కృష్ణ, ఎ ఎన్ ఎం పద్మ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: