భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని అశ్వాపురం రైతు వేదికలో తాసిల్దార్ సురేష్ కుమార్ అధ్యక్షతన గోదావరి వరద ముంపు సమీక్ష సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలోని మండలోని అన్ని శాఖల అధికారులు, గ్రామ రెవెన్యూ అధకారులు వరద ముంపు ప్రాంత పంచాయతీ కార్యదర్శుల తో రానున్న రోజుల్లో వరద వస్తే తీసుకునే చర్యల గురించి చర్చిం చి అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది.కొంతమంది అధికారులు ఈ సమీక్షా సమావేశాని కి హాజరు కాకపోవడం వల్ల తాసిల్దార్ సురేష్ కుమార్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.అదేవిధంగా సివిల్ ఆఫీసర్ ముత్తయ్య,మాట్లాడుతూ రేషన్ డీలర్ల, రేషన్ తీసుకున్న ప్రజలు అక్కడే అమ్ముతూ ఉన్నారని , అమ్మిన వారికి కొన్నవారికి కూడా వారిపై చట్టరీత్యా యాక్షన్ తీసుకొని వారికి రేషన్ కార్డు ప్రభుత్వం పై లబ్ధి పొందే వన్ని రద్దు చేస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో సి ఐ. సట్ల రాజు , డిప్యూటీ తాసిల్దార్ మణీందర్ ,ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్ ,సివిల్ ఆఫీసర్ ముత్తయ్య, ,ఆర్ఐ ,రమాదేవి , ఎంపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: