నిరంతరం ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తాం ఏఈ రవి
గుండాల జూన్ 4(మన్యం టీవీ) పల్లె ప్రగతిలో విద్యుత్ శాఖ అధికారులు అదనపు విద్యుత్ స్తంభాలను విద్యుత్ లైన్ కిందికి వేలాడుతున్న ప్రదేశాల్లో ఈ స్తంభాలను ఏర్పాటు చేశారు. అనంతరం ఏఈ రవి మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం విద్యుత్ లేకుండా చూస్తామని అన్నారు. పడుగోనుగూడెం పంచాయతీ పరిధిలోని కొడవటంచ గ్రామంలో ఈ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ప్రజలు విద్యుత్ సమస్యలపై ఏ సమయంలోనైనా అధికారులను సంప్రదించవచ్చని అన్నారు. సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి సంస్థ మనుగడకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యం , సర్పంచ్ జయసుధ , లైన్ మెన్ నరేష్ , విద్యుత్ సహాయ సిబ్బంది. కాంతారావు మర్రి నగేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: