CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆలం రామ్మూర్తి అకాలమరణం ఆదివాసీలకు తీరని లోటు

Share it:

 


*రామ్మూర్తి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క. 

మన్యం టీవీ ఏటూరు నాగారం

తాడ్వాయి మండలంలోని మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆలం రామ్మూర్తి రెండు రోజుల క్రితం గుండె పోటు తో మరణించగా,ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క మంగళవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం జాతర ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మూడు సార్లు పని చేసి వన దేవతల జాతరను దేశం లోనే అతి పెద్ద జాతర గా గుర్తించడానికి ఆయన సేవలు మరువలేనివి అని,ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రఘడ సానుభూతి సంతాపం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల అధ్యక్షులు జాలపు అనంతరెడ్డి,

ఎండీ చాంద్ పాషా, సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్,మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు,ఎంపీటీసీ ఏడు కొండలు, అనిల్ కుమార్, కృష్ణ రెడ్డి,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,మేడం రమణకర్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: