గుండాల జూలై 1 (మన్యం టీవీ) డాక్టర్స్ డే సందర్భంగా గుండాల ప్రాథమిక వైద్యశాల వైద్యుడు రవి చంద్ ను టిఆర్ఎస్ పార్టీ గుండాల మండల అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎంతో కృషి చేశారు అన్నారు. కరోనాను ముందుండి ఎదుర్కొంటూ ప్రజలకు వైద్యం అందిస్తూ వెలలేని సేవలను అందించారని ఆయన కొనియాడారు. విపత్కర ఈ పరిస్థితులలో ప్రజలను వెన్నంటి ఉండి సేవలందించిన డాక్టర్లకు ఎంత చేసిన తక్కువేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు పాల్గొన్నారు
Post A Comment: