వాగు ఉధృతంగా ప్రవహించిన దృఢంగా వంతెన🔥ఏళ్ల నాటి సమస్య కు పరిష్కారం🙏పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన పలు గ్రామాల ప్రజలు✍️గడ్డం వీరన్న,మన్యం మనుగడ ప్రతినిధి
గుండాల జూలై 24 (మన్యం మనుగడ) చెక్కుచెదరని పోలీస్ వంతెన. గుండాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ ఐ ముత్యం రమేష్ కిన్నెరసాని వాగుపై ఏర్పాటుచేసిన తాత్కాలిక వంతెన కిన్నెరసాని ఉధృతంగా ప్రవహించి న దృఢంగా ఉంది. గిరిజనులు కర్రల వంతెన పై అతి కష్టం మీద వాగు దాటుతున్న దృశ్యాలను గమనించిన ఎస్ ఐ ముత్యం రమేష్ మరుసటి రోజే తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు. మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కిన్నెరసాని ప్రమాద స్థాయికి మించి ప్రవహించింది అయినా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన వంతెన చెక్కుచెదరకుండా దృఢంగా ఉంది
Post A Comment: