మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని చిన్నబోయినపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చింతలపాడు గుత్తి కోయ గుంపులో పోలీసు మరియు ఫారెస్టు శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏటూరు నాగారం ఏఎస్పీ మాట్లాడుతూ సంఘవిద్రోహ శక్తులకు ఆశ్రయం ఇవ్వద్దని మీ గూడెం లోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని అన్నారు. చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలకు ఎవరైనా మీ గూడెంలోని వారు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్డన్ సెర్చ్ లో ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారి ప్రశాంత్ బి.పాటిల్, ఏటూరు నాగారం ఎఫ్ డి ఓ గోపాల్ రావు,ఏటూరు నాగారం సీఐ కిరణ్ కుమార్, స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, సివిల్,సిఆర్పిఎఫ్ మరియు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: