మన్యం టివి: ములకలపల్లి మండలం: అశ్వారావుపేట నియోజక వర్గ కాంగ్రెస్ యూత్ అధ్యక్షతన పవన్ కళ్యాణ్ సేవసమితి సభ్యులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో యుత్ కాంగ్రేస్ అధ్యక్షులు కోరంపంల్లి చెన్నారావు మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో కరోనాతో మృతి చెందితే, కుటింబికులు కూడా దగ్గరకు రాని పరిస్థితుల్లో, పవన్ కల్యాణ్ సేవాసమితి వారు అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహిస్తూ, బాధిత కుటుంభాలకు అండగా నిలవటం గొప్ప మనస్సుకు నిదర్శనమన్నారు. అలాగే రక్తం అవసరమై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మంది రోగులకు తమ సేవా సమితి ద్వారా రక్తం దానం చేసి ప్రాణాలు కాపాడారన్నారు. ఏమీ ఆశించకుండా వారు చేస్తున్న సేవలకు ఏమిచ్చినా రుణం తీరదని, పవన్ కల్యాణ్ సేవాసమితి అధ్యక్షులు ఇనుకుర్తి రామాచారి, బైక్ మెకానిక్ సుభాని, బచ్చెల సురేష్, చామర్తి శివాజి, చైతన్య, ఆటో దినేష్, నీలాల సందీప్ లను శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉదయశ్రీ, మండల కాంగ్రేస్ అధ్యక్షులు పేటేటి నర్సింహరావు, కొప్పుల రాంబాబు, మడకం శ్రీను, బుగ్గారపు సత్యనారయణ పాల్గొన్నారు
Navigation
Post A Comment: