మండలంలో ప్రధాన వంతెనలు పూర్తి
ఇదంతా విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కృషి
గుండాల జూలై 12 (మన్యం మనుగడ) నాడు అలా నేడు ఇలా అన్న రీతిలో అభివృద్ధి జరుగుతుంది. మండలంలో ప్రధాన వాగుల పై వంతెనలను పూర్తి చేయించిన ఘనత పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు దేనని మండల వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుండాల దేవాల గూడెం వెళ్లే మార్గమధ్యలో ని మల్లన్న వాగుపై వంతెన పూర్తవడంతో నాడు అలా ఉండే ఇప్పుడు ఇలా వంతెన పూర్తి అందుబాటులోకి వచ్చిందని వాగు అవతల ఉన్న గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనితోపాటు మండలంలో అన్ని ప్రధాన వంతెన లన్నిటిని పూర్తి చేయించి ప్రజల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా చేయించిన ఘనత రేగా కాంతారావు కి దక్కుతుందని గిరిజన వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
Post A Comment: