మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని రేగుల గండి,గుత్తి కోయ గ్రామంలో మణుగూరు *సిఐ భాను ప్రకాష్* *ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్* ను గుత్తి కోయలకు లకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ఉద్దేశించి సిఐ భాను ప్రకాష్ మాట్లాడుతూ ఇది వర్షాకాలం సీజన్,మీరు మంచి నీటి కోసం చెరువుల్లో కుంటల్లో నీరు తీసుకొస్తూ ఉంటారు.ఆ నీళ్లు తాగడం వలన పిల్లలు,మీరు కూడా అనారోగ్యం పాలవుతారు అని,కనుక జిల్లా *ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్* ఆదేశాల మేరకు మీకోసం ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్, ఎంతగానో ఉపయోగ పడుతుందని,దీంట్లో నీళ్లు తాగడం వలన మీరు కానీ, పిల్లల కానీ మంచి ఆరోగ్యం తో ఉంటారని,ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేయండి వెంటనే మా సిబ్బంది తో మీకు ఏర్పాటు చేస్తామని సిఐ భాను ప్రకాష్ తెలిపారు.ఈ కార్యక్రమం లో,ఎస్ ఐ పురుషోత్తం,ఏ ఎస్ ఐ నాగేశ్వరరావు,సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: