భద్రాచలం పంచాయితీ యా? మున్సిపాలిటీయా? ప్రభుత్వం తేల్చాలి
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సిపిఎం వినతి
మన్యం మనుగడ, భద్రాచలం టౌన్:
పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం పట్టణ ముంపు ప్రమాదం పై ఒక స్పష్టత ఇవ్వాలని, భద్రాచలం పంచాయతీ నా మున్సిపాలిటీ నా స్పష్టత ఇవ్వాలని కోరుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా భద్రాచలం విచ్చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ కు సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ వినతి పత్రం అందించడం జరిగింది.
ప్రతి సంవత్సరము గోదావరి వరదల కారణంగా భద్రాచలం పట్టణంలోని పలు కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. ప్రస్తుతము పోలవరం ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కావడంతో ఇప్పటికే బ్యాక్ వాటర్ నీటి మట్టం పెరిగి ఉందని, వర్షాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో గోదావరి వరదలు సంభవిస్తే భద్రాచలం పట్టణం ముంపు పరిస్థితి ఏమిటి? అనేక మంది మేధావులు, ఇంజనీర్లు పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం పట్టణంకు ముంపు ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. దీనితో భద్రాచలం పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొని ఉన్నది. ఇట్టి పరిస్థితులలో పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం పట్టణానికి ప్రమాదం ఉన్నదా? లేదా? ఉంటే ఎంత మేరకు ఉన్నది? ఎన్ని కాలనీలు ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నది?ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమి చేస్తున్నారు? అనే విషయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం,ఉన్నత అధికారులు ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.
పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం ముంపు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టత ఇవ్వాలని, భద్రాచలం పట్టణ అభివృద్ధికి ఆటంకంగా మారిన భద్రాచలం మున్సిపాలిటీయా? పంచాయతీయా? అనే విషయం తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం. రేణుక, ఎం బి నర్సారెడ్డి పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు భీమవరపు వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు లు పాల్గొన్నారు.
Post A Comment: