జనగాం జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన బాలుడు
శోక సముద్రంలో కుటుంబం
గుండాల జూలై 27 (మన్యం మనుగడ) సరదాగా కాసేపు ఈత కొడదామని వెళ్లి మృత్యువాత పడ్డ బాలుడు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన షేక్ రెహాన్ 11 గుండాల మండల కేంద్రంలో బంధువుల ఇంటికి వచ్చి సమీప కిన్నెరసాని వాగులో స్నానం చేద్దామని వాగులో దిగటంతో లోతు ఎక్కువ ఉన్నందున మునిగిపోయాడు. అక్కడే ఉన్న వాళ్ల మామయ్య గమనించి రెహనా తో పాటు మరో ఇద్దరిని ఒడ్డుకు చేర్చాడు అప్పటికే రెహమాన్ అప్పటికే సృహ కోల్పోవడంతో 108 సమాచారం అందించి గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అప్పటికే రెహాన్ మృతిచెందాడని వైద్యుడు చెప్పడంతో కుటుంబ సభ్యులందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న గుండాల ఎస్ ఐ ముత్యం రమేష్ కేసు నమోదు చేసి బాలుని పోస్టుమార్టం నిమిత్తం ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
Post A Comment: