ఉధృతంగా ప్రవహించే టప్పుడు వాగులు దాట వద్దు తాసిల్దార్ రమేష్
గుండాల జూలై 12 (మన్యం మనుగడ) మండలంలో గత రెండు రోజులుగా వర్షం భారీగా కురుస్తుండటంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం తాసిల్దార్ రంగు రమేష్ మండలం పరిధిలోని మల్లన్న వాగు, కిన్నెరసాని, ఏడి మెలికల , వాగులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉధృతంగా ప్రవహించేటప్పుడు దాట వద్దని ఆయన సూచించారు. దానితోపాటు చేపలు పట్టడానికి వాగులోకి దిగవద్దని ఆయన సూచించారు. అప్రమత్తత గా వ్యవహరించాలని ఆయన కోరారు. తాసిల్దార్ వెంట ఆర్ ఐ నాగేశ్వరరావు, వీఆర్ఏలు లక్ష్మణ్, శివాజీ, సారయ్య లు ఉన్నారు
Post A Comment: