అభాగ్యులకు అండగా సత్తు లాల్
ప్రభుత్వ పాఠశాలలకు సైతం పరికరాలను సమకూరుస్తున్న ఉపాధ్యాయుడు
గుండాల జూలై 27 (మన్యం మనుగడ) చేతన ఫౌండేషన్ పలువురికి చేయూతని అందిస్తుంది ఇందులో సభ్యుడిగా చేరిన ఉపాధ్యాయుడు సతులాల అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు. దానితోపాటు ప్రభుత్వ పాఠశాలలకు సైతం పరికరాలను సమకూరుస్తూ పలువురి అభినందనలను అందుకుంటున్నాడు. సోమవారం మండలంలో చేతన ఫౌండేషన్ ద్వారా 2 ప్రభుత్వ పాఠశాలలకు ఆన్లైన్ తరగతుల కోసం 2 డిటిహెచ్ లను అందజేశారు. దానితోపాటు పోతి రెడ్డి గూడెం గ్రామానికి చెందిన దివ్యం గుడికి ట్రై సైకిల్ అందజేశారు. వారం రోజుల క్రితం కొడవటంచ గ్రామంలో ఈ సం బక్కయ్య ఇల్లు కాలి పోయినందున వారికి చేతన పౌండేషన్ తరఫున బియ్యంతో పాటు నిత్యవసర వస్తువులను అందజేశారు. ఉపాధ్యాయుడు సతులాల్ మరియు వరుణ్ నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారికి అందజేశారు. ఏజెన్సీ వాసులను ఆదుకోవడం చాలా ఆనందంగా ఉందని సత్తు లాల్ అన్నారు. ఫౌండేషన్ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీపీ ముక్తి సత్యం , వరుణ్, రషీద్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: