మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల పరిధిలోని దమ్మకపేట, సాంబాయిగూడెం గ్రామ పంచాయితీలలో సర్పంచ్ లు రాంబాబు,కాయం తిరుపతమ్మ,ఆధ్వర్యంలో జరుగుతున్న నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి పారిశుధ్య పనులను, మొక్కలు నాటే పనులను, శుక్రవారం జడ్పీటీసీ పోశం. నరసింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి,మండల స్పెషల్ ఆఫీసర్ రమాదేవి జరుగుతున్న పనులను పరిశీలించారు.అనంతరం పల్లె ప్రకృతి వనం నందు మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వీరబాబు,ఎంపీఓ వెంకటేశ్వరరావు,పిఏసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ముత్యంబాబు, కార్యదర్శి శ్రీనివాస్ కుమార్, ఉప సర్పంచ్ షేక్. పెంటుమియా,వార్డు సభ్యులు భవాని,రమణ, మల్లమ్మ,సునీత,పంచాయితీ సిబ్బంది సరెడ్డి రవి,వట్టం సాంబశివరావు,శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: