మాన్యం టి వి దుమ్ముగూడెం: బంగారు తెలంగాణ సాధనలో భాగంగా తెలంగాణలోనిర్వహిస్తున్న పల్లెప్రగతి గ్రామ సభ ద్వారా అన్ని రకాల సమస్యల పరిష్కారానికి నాంది పలుకుతున్నాయని బి కొత్తగూడెం స్పెషలాఫీసర్ ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.గురువారం నాడు గ్రామ పంచాయతీ లొ ఏర్పాటు చేసిన గ్రామ సభకు సర్పంచ్ కాటుబోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.ఈ సభలో సర్పంచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పంచాయతీల్లో అన్ని సమస్యలు సానుకూలంగా పరిష్కరిస్తామని భాగంగా ఈరోజు గ్రామంలోని ప్రతి ఇంటిలో విధిగా ఆరు మొక్కలను నాటాలని గ్రామస్థులకు పిలుపునిచ్చారు. ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా గ్రామంలో కోవింద్ నిబంధనలను పాటించాలని బడిని, గుడిని అభివృద్ధి చేసే దిశగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ప్రతి విద్యార్థి చదువు పట్ల అందరూ శ్రద్ధ వహించాలని బెక్కంటి పిలుపునిచ్చారు.పాఠశాలలు అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని కాబట్టి ప్రతి ఒక్కరూ పాఠశాల అభివృద్ధిలో తమవంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. గ్రామ సెక్రెటరీ మహేష్ మాట్లాడుతూ ఐటీసీ పీఎస్పీడీ సారపాక వారి సౌజన్యంతో గ్రామంలో మరుగుదొడ్లు, పాఠశాల అభివృద్ధి జరుగుతుందని వారి సేవలను మరింతగా కొనసాగించాలని కోరారు.పాఠశాలలో పిల్లలకు ప్రమాదకరమైన పురాతన మైన కట్టడాలను కూల్చేయాలని గ్రామ సభలొ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి గృహానికి ఆరు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులతో పాటు అంగన్వాడీ,ఆరోగ్య కార్యకర్తలు,వార్డు మెంబర్లు పంచాయతీ సిబ్బంది వినోద్,నర్సింహారావు తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: