మన్యం టీవీ ఏటూరు నాగారం
జిల్లాలో ప్రతిష్టాత్మకంగా గురువారం రోజున పల్లె ప్రగతి నాలుగో విడత లో భాగంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని అమ్మవారి దీవెనలతో నాలుగో విడత పల్లె ప్రగతి అభివృద్ధి పనులు ప్రారంభించారు. మొదటగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో గ్రామ సభలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు వినతులను స్వీకరించారు. గ్రామ సభ ద్వారా ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత మేరకు వారి సమస్యలపై తాసిల్దార్ శ్రీనివాస్ తో మాట్లాడి ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఐదు ఫీట్ల మొక్కలను నాటాలని అవి త్వరగా నాటుకు ఉంటాయని అన్నారు. అనంతరం ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి లో ని నర్సరీని సందర్శించిన చిన్న బోయిన పల్లి గ్రామపంచాయతీ ఆవరణం ఆనుకొని ఉన్న హైవే పక్కన మొక్కను నాటారు. అనంతరం డాక్టర్స్ డే సందర్భంగా గా ఏటూరు నాగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఇక్కడ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మిత్ర బృందం కాళోజి హెల్త్ యూనివర్సిటీ తెలంగాణ వారి మిత్రులు 1986 బ్యాచ్ (డాల్ఫిన్) కే ఎం సి వారి సహకారంతో కరోనా విపత్కర పరిస్థితుల్లో చేపడుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన మెడికల్ పరికరాలు, మందులను అందిస్తున్న డాక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఐటిడిఎ పిఓ హనుమంతు కె జెండా గే, జిల్లా పరిషత్ సీఈఓ ప్రసన్న రాణి, ఏటూరు నాగారం మండల ఎంపీడీవో తాడ్వాయి మండలం ఎంపీడీవో తాడ్వాయి ఎంపీపీ, మేడారం సర్పంచ్, చిన్నబోయినపల్లి సర్పంచ్, ఈ గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లు, అలాగే ఏటూరునాగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: