CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కి వినతి పత్రం

Share it:

 


మన్యం మనుగడ, భద్రాచలం టౌన్: భద్రాచలంలో జరిగిన దళిత సాధికారత" సభలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్  దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముద్దా పిచ్చయ్య మాట్లాడుతూ  గత 20 సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నత చదువులు చదివిన దళిత నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అటువంటి ఏజెన్సీ ప్రాంత దళిత నిరుద్యోగులకు దళిత సాధికారత పథకం కింద 10 లక్షల రూపాయలు అందించి ఉపాధి కల్పించాలని అన్నారు. అట్లాగే షెడ్యూల్డ్ కులాల్లో అత్యంత వెనుకబడిన, రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల పైన చెప్పులు కుట్టుకొని చాలీ,చాలని ఆదాయంతో జీవిస్తున్న చర్మకారులకు స్థిరనివాసం లేకుండా సంచార జీవులుగా జీవిస్తున్న బేడ బుడగ జంగం, పారిశుద్ధ్య కార్మికులైన రెల్లి కులస్తులనుదళిత సాధికారత పథకంలో ప్రాముఖ్యత నిచ్చి ఆదుకోవాలని అన్నారు. అదేవిధంగా భద్రాచలం పట్టణంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు సంబంధించిన నిర్మాణ నిధులను కేటాయించాలని మంత్రిగారి ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లమందల వెంకటేశ్వర్లు, మహేష్ బాబు, జీవరత్నం, తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: