🙏మానవత్వంతో క్షతగాత్రులను హాస్పిటల్ కి చేర్చి వైద్య చికిత్సలు అందించిన వైనం
🙏 సకాలంలో స్పందించిన సీఐ ఉపేందర్ రావుకు ప్రశంసల జల్లు
మన్యం మనుగడ, అశ్వారావుపేట:
వ్యవసాయ కళాశాల వద్ద గుర్తుతెలియని వాహనం నారం వారి గూడెం స్టేజీ లో నివాసం ఉంటున్న వ్యాపారిని ఆయన కొడుకుని ఢీ కొనడంతో రోడ్డుపై గాయాలతో సాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో దమ్మపేట నుండి అశ్వారావుపేట వస్తున్న సీఐ ఉపేందర్ రావు మానవత్వంతో బాధితులను వెహికల్ లో ఎక్కించుకొని అశ్వారావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్సలు చేయించారు. ఆపదలో ఉన్న వారిని మనకెందుకులే అని వదిలేయకుండా దగ్గరుండి వైద్యం చేయించడం ఇది రెండవ సారి.సీఐ చూపిస్తున్న మానవత్వానికి ప్రతి ఒక్కరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Post A Comment: