CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం..

Share it:

 


ఎన్నికల హామీలు తక్షణమే అమలు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ప్రదర్శన...   


  మన్యం టీవీ : జూలూరుపాడు, జూలై 15, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. 

గురువారం జూలూరుపాడు ప్రధాన రహదారి పై భారీ బైక్ ర్యాలీ, ప్రదర్శన, నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి సిపిఐ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు మాట్లాడుతు.. పోడు సాగు దారులకు పోడు భూమి పట్టాలు ఇవ్వాలని, అక్రమంగా వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గురువారం కలెక్టరేట్ ముట్టడికి జూలూరుపాడు నుంచి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పేద, సామాన్య, మధ్య తరగతి, ప్రజలు నిత్యవసర వస్తువుల ధరలు విచ్చలవిడిగా పెంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారని, పెట్రోల్ డీజిల్ ధరలు కార్పోరేట్ కంపెనీలకు మోడీ ఊడిగం చేస్తూ వారి కనుసన్నల్లో నడుస్తున్నారని విమర్శించారు. దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా నేటికీ పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరి లో ప్రభుత్వం విఫలమైందని మాయ మాటలతో కాలయాపన కొనసాగిస్తున్నారని, జూలూరుపాడు మండల కేంద్రంలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎల్లంకి మధు, చింత స్వరాజ్ రావు, దేవినేని జనార్ధన్, ఎస్ కె నాగులు మీరా, యాస రోశయ్య, గజవాడ సీతయ్య, చిమ్మట ముత్తయ్య, నరసింహారావు, ఉదరీ నాగయ్య, పొన్నెకంటి వెంకటేశ్వర్లు, వల్లమల్ల సామేలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: