మన్యం మనుగడ, పినపాక:
పోడు కోసం చేసిన కష్టం, నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం పంచాయతీలో చోటు చేసుకుంది. ఏడూళ్ల బయ్యారం ఎస్ఐ టీవీఆర్ సూరి తెలిపిన వివరాల ప్రకారం, మల్లారం పంచాయతీలోని స్థానిక గిరిజనులకు ఆదివాసీలకు మధ్య జరిగిన పోడు పోరు కారణంగా, మల్లారం వలస ఆదివాసీ కుంజా సురేష్, మనస్తాపానికి గురై నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు అని, సురేష్ భార్య సమ్మక్క తెలిపిన వివరాల ప్రకారం మల్లారం స్థానిక గిరిజనులు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు.
Post A Comment: