డాక్టర్ల సేవలు మరువలేనివి,డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లను సన్మానించిన విప్ రేగా కాంతారావు
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో డాక్టర్స్ డే సందర్భంగా స్థానిక మణుగూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లోని పని చేస్తున్న డాక్టర్లు మౌనిక, ప్రకాష్,డాక్టర్లను విప్ రేగా కాంతారావు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో స్తంభించిపోయిన,డాక్టర్ వారి ప్రాణాలను పణంగా పెట్టి,వైద్య సేవలను అందించారని,కరోనా మహమ్మారి ని అంతం చేయడానికి,రాత్రనక,పగలనక పని చేస్తున్నారని వారి సేవలను కొనియాడారు. కరోనా పేషంట్స్ కు వైద్యం అందించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లు సేవలను ఎప్పటికి మారువలేనివి అన్నారు,డాక్టర్లు,వైద్య సిబ్బంది సేవలు మాటల్లో వర్ణించలేనిది అని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లను, వారి సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,విప్ వ్యక్తిగత సహాయకులు హరికృష్ణ,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,ఎక్సల్లెంట్ స్కూల్ విద్య సంస్థల చైర్మన్ యూసఫ్ షరీఫ్,టిఆర్ఎస్ నాయకులు ముద్దంగుల. కృష్ణ,వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: