చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
మండల పరిధిలోని మద్దుకూరు గ్రామపంచాయతీ లో జరుగుతున్న అభివృద్ధి పనులను మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భానోత్ పార్వతి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా గ్రామంలో ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. హరితహారం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటారు అనంతరం నూతనంగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల ను పరిశీలించారు. మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తి చేయాలని అంతర్గత రోడ్లు, కరెంట్ పోల్స్, విద్యుత్ వైర్లు త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని అవెన్యూ ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. గ్రామాల్లో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని ఎక్కడ అపరిశుభ్రత లేకుండా పనులు చేపట్టాలని. హరిత హారంలో నాటిన మొక్కలు వందకు వందశాతం బతికేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అక్కడి నుంచి వైకుంఠధామం డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. వైకుంఠధామం లో కూడా ప్రశాంత వాతావరణం ఏర్పడేలా పూల మొక్కలు డిజైన్ మొక్కలను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్దం వినోద్, సిడిపిఓ నిర్మల జ్యోతి, ఎంపీడీవో జి అన్నపూర్ణ, ఎంపీవో తోట తులసీరామ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణకుమారి, గ్రామ పెద్దలు చుండ్రు విజయ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: