జిల్లా వైద్య అధికారిని శిరీషా
మన్యం మనుగడ, అశ్వాపురం:
అశ్వాపురం మండలం రామచంద్రాపురం గ్రామంలోని డెంగ్యూ కేసులు ఎక్కువ అవుతున్నందున ఈరోజు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు గారు అక్కడి వైద్య చర్యల పరిస్థితిని చూడాలని జిల్లా వైద్య అధికారికి అదేశించగా ఎంపీపీ ముత్తినేని సుజాత గారి ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది ఇంటింటి సర్వే చేసారు.ఈ సందర్భంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో వర్షపు నీటి నిలువ,మురికి నీరు నిలువ వల్ల డెంగ్యూ దోమలు ఎక్కువగా ఉండి జ్వరాలు పెరిగేందుకు కారణం అవుత్వున్నవి అని పరిసర ప్రాంతాలు శుభ్రముగా ఉంచుకోవాలని ప్రజలకు ఎంపీపీ,Dm&Ho Dr శిరీషా సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,తెరాస మండల అధ్యక్షులు కోడి అమరేందర్,సర్పంచ్ కాకా అశోక్,ఎంపీటీసీలు కమటం నరేష్,గాదె జయ,డిప్యూటీ Dm &Ho dr వెంకటేశ్వరరావు,Dr చెతన్(dso ) Dr కృష్నయ్య (Heo ) Dr సుందర్,పంచాయితీ సెక్రెటరి దీపక్,మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,మందా హుస్సేన్,ఇసంపల్లి పున్నారావు,సురేందర్ రెడ్డి,ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: