మన్యం టీవీ కొత్తగూడెం జులై 15:- కొత్తగూడెం వాస్తవానికి దగ్గరలో జీవించడం అతనికి అలవాటు. ఫోటోగ్రఫీలో ఉన్న నైపుణ్యాని ఆలంబనగా జర్నలిజం వైపు అడుగులు వేసి పేదల కష్టాలను , అన్నార్డుల ఆర్తనాదాలను , నిస్సహాయుల దీన స్థితిని తన కెమెరాతో బంధించి వార్తల రూపంలో బాహ్య ప్రపంచానికి తెలియచేసిన సీనియర్ జర్నలిస్ట్ చింతల చిరంజీవి జన్మదిన వేడుకలు భద్రాద్రి జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో జర్నలిస్ట్ సోదరుల మధ్య కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అతి కొద్దిమంది సమక్షంలో జరుపుకున్నారు . పేదలకు ఎక్కడ ఏ కష్టం వచ్చిందన్నా నేనున్నానంటూ ముందువరుసలో ఉండి వాళ్ల బాధలను మీడియా ద్వారా వెలికితిస్తు గతంలో జాతీయస్థాయి అవార్డుతో పాటు పలు అవార్డులను పొందిన మన్యం టీవీ ప్రతినిధి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఈ జన్మదిన వేడుకల్లో తెంజు జిల్లా అధ్యక్షులు వట్టికొండ రవి, మోటమర్రి రామకృష్ణ, పాపారావు, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్, కంచి యోహాన్, రత్నకుమార్, అప్జల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: