కొత్తగూడెం చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ భీమానాయక్
మన్యం మనుగడ, పినపాక:
ఏడవ విడత హరితహారం కార్యక్రమం లో లక్ష్యానికి మించి మొక్కలు నాటాలని జిల్లా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బీమా నాయక్ అన్నారు . ఆయన శనివారం జానంపేట రిజర్వ్ ఫారెస్ట్, కంపార్ట్మెంట్ నెంబర్ 30 లో మొక్కలు నాటి మాట్లాడారు. రిజర్వ్ ఫారెస్ట్ లోని ఖాళీగా ఉన్న ప్రదేశాలలో విరివిగా మొక్కలు నాటాలని , నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, సిబ్బందికి సూచించారు . ముఖ్యంగా అడవులను ధ్వంసం చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు .
ఈ కార్యక్రమంలో డి ఎఫ్ ఓ లక్ష్మణ్, రంజిత నాయక్, ఎఫ్ డి ఓ వేణుబాబు , ఎఫ్ ఆర్ ఓ తేజస్విని, డి ఆర్ ఓ అరుణ , ఎఫ్ బి వో లు వేణు ,లక్ష్మణ్ సిబ్బంది పాల్గొన్నారు .
Post A Comment: