సాబీర్ పాషా సి. పి. ఐ. జిల్లా కార్యదర్శి*
మన్యం టీవీ చర్ల :గిరిజనులు సాగు చేసుకుంటున్న పొడు భూములను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం అన్యాయమని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. బుధవారం పోడు భూముల సమస్యపై మాట్లాడటానికి మామిడి గూడెం గ్రామం వచ్చిన సందర్భంగా సాబీర్ పాష మాట్లాడుతూ, గిరిజనుల భూమికోసం పోరాటాలు చేస్తామని అవసరమైతే వారి కోసం జైలుకెళ్లడా ని కైనా సిద్ధంగా ఉన్నామన్నారు, 1996 లో మామిడిగుడెం గ్రామానికి చెందిన సుమారు వంద కుటుంబాలకు చెందిన గిరిజనులు పోడు సాగు చేసుకుంటుంటే ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టడం జరిగిందని, 2005 సంవత్సరానికి ముందు ఫారెస్ట్ కేసులు ఆయన భూములకు 2006 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని ఆయన అన్నారు. చట్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఫారెస్ట్ అధికారులు గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను ఆక్రమించడం అన్యాయమని ఆయన విమర్శించారు. గిరిజనులకు జిల్లా పార్టీ అండగా ఉంటుందని ఆయన మహిళలకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గిరిజనులకు పోడు భూమి పట్టా లకై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. సిపిఐ దశాబ్దాల తరబడిభూమి లేని నిరుపేదలను గుర్తించి , వారికి ప్రభుత్వం నుంచి భూమి పట్టాలు ఇప్పించడంలోను,భూ పోరాటాలు చేయడంలో ఎప్పుడూ ముందంజలోనే ఉందని అన్నారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున వెంట రాగా పోడు భూములును సందర్శించారు, ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు అడ్డగర్ల తాతాజీ, రామిరెడ్డి , దేవరపల్లి సర్పంచ్ కారం సమ్మయ్య రామారావు తెల్లం బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: