మన్యం టీవీ, అశ్వాపురం:ఈ నెల 24న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటి ,మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా,రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ జరిగే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఈ భాహోత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం అని ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతరావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండలంలోని ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు ,సోషల్ మీడియా సభ్యులు, ప్రతి ఒక్కరు ఈ ముక్కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ తెలియజేశారు.
Post A Comment: