మన్యం మనుగడ, మణుగూరు:
ఈ నెల 24న తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజున ముక్కోటి వృక్షర్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
హరితహారం స్ఫూర్తితో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు.
తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఒకే రోజు ఓకే గంటలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల మొక్కలు నాటాలని టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందన్నారు.
నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీ లు, జడ్పీటీసీలు, సర్పంచులు, వైస్ ఎంపీపీ లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, సొసైటీ చైర్మన్ లు, సొసైటీ వైస్ చైర్మన్ లు, సొసైటీ డైరెక్టర్ లు, వార్డ్ నెంబర్ లు, పార్టీ సీనియర్ నాయకులు, యువజన విభాగం అధ్యక్షులు,TRSV విద్యార్థి విభాగం నాయకులు, టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు, వివిధ పదవుల్లో ఉన్న, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు భాగస్వాములై ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటాలని ఆయన కోరారు.
ఈనెల 24న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు ఎంపీ & టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టబోయే ముక్కోటి వృక్షర్చన కార్యక్రమంలో భాగంగా పినపాక నియోజకవర్గం లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి ముక్కోటి వృక్షర్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పిలుపునిచ్చారు .
Post A Comment: