CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీ వివాదం

Share it:

 


✍️డాక్టర్ చందా సంతోష్ వర్గం వర్సెస్ కొరస ఆనంద్ వర్గం

✍️కొరస ఆనంద్ కు మద్దతుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన కొందరు కాంగ్రెస్ నాయకులు

✍️డి సి సి కి ఫిర్యాదు చేయనున్నారు మరో వర్గం

✍️కొత్త దామోదర్ గౌడ్

మన్యం మనుగడ వెబ్ డెస్క్:

పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ పార్టీ పినపాక నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు కోరస ఆనంద్ కుమద్దతుగా శుక్రవారం ఆనంద్ మద్దతు దారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వివాదం ముదిరింది. వివరాలు ఇలా ఉన్నాయి. పినపాక కాంగ్రెస్ పార్టీని కొరస ఆనంద్ గత కొన్ని సంవత్సరాలుగా అంటిపెట్టుకుని ఉండి చురుకుగా ఆ పార్టీ కార్యమాలలో పాల్గొంటున్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితంకొత్తగూడెం డీ సీ సి అధ్యక్షులు పొదేం వీరయ్య పినపాక నియోజకవర్గ కన్వీనర్ గా డా.చందా సంతోష్ కు భాద్యతలు అప్పగించారు. ఆనాటి నుండి పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ని అంటిపెట్టుకుని గత పది సంవత్సరాలుగా ఉన్న తమను కాదని వేరే వారు పదవులు అలంకరించడం పట్ల ఒక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వారు పీ సీ సీ ఉపాధ్యక్షులుపొదేం వీరయ్య తీరుపట్ల గుర్రుగా ఉన్నారు. కష్టపడే కార్యకర్తల కాదని ఇతరులకు పదవులు అమ్ముకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీల ఏర్పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న అంతర్గత విభేదాలను బట్టబయలు చేసింది. ఇది ఇలా ఉండగా పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేక పనులు నిర్వహిస్తున్న వారిపై పై చర్యలు తీసుకోవాలని డీ సీ సీ కి డా.చందా సంతోష్ వర్గం ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

Share it:

TELANGANA

Post A Comment: