CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి

Share it:

 


 మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి లో సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల రిలే నిరాహారదీక్షలకు సంఘీబావం తెలిపి బుదవారం దీక్షలు ప్రారంభించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా నాయకులు కొల్లు వెంకట రెడ్డి, గాదె వెంకటరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల కు ఎకరానికి రూ. 25 లక్షలు నష్ట పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జల విద్యుత్ కేంద్రం లో నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వారం రోజులుగా నిర్వాసితులు దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించక పోవడం దారుణ మన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ తెలంగాణ నాయకులు మారం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: