👉హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతులు పొందిన 13 మంది కానిస్టేబుళ్లను అభినందించిన జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపిఎస్.
మన్యం టీవీ కొత్తగూడెం జూలై9:- శుక్రవారం నాడు
జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీ ఎస్,ఓఎస్డీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూ హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతులు పొందిన 13 మంది కానిస్టేబుళ్లను తన కార్యాలయంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ వి.తిరుపతి, ఆర్ఐ ఆపరేషన్స్ ప్రసాద్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ దత్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు. పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది మరియు అధికారులు పోలీసు శాఖలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు. జిల్లా పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు,గౌరవ మర్యాదలు లభిస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు.ఓఎస్డీ కార్యాలయంలో క్రమశిక్షణతో భాద్యతగా విధులు నిర్వర్తిస్తున్న 13 మంది కానిస్టేబుల్స్ కు హెడ్ కానిస్టేబుళ్లు గా పదోన్నతిని కల్పిస్తూ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి జూలై 8 న ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది.
Post A Comment: