కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సైకిల్ మరియు ఎడ్ల బండ్ల ర్యాలీ:నాయకులు పొలమూరి.రాజు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏఐసీసీ మరియు టి పి సీసీ ఆదేశాల మేరకు పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్,ధరల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల పై వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో జరిగిన సైకిల్ మరియు ఎడ్ల బండ్ల ర్యాలీ లో పాల్గొన్న జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొలమూరి. రాజు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం లో రోజు రోజు కు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతం గా పెరిగి సామాన్య మధ్య తరగతి జీవితాలు దుర్బరంగా మారాయి అన్నారు.2014 లో కాంగ్రెస్ ప్రభుత్వం లో క్రూడ్ ఆయిల్ ధర ఎక్కువ గా ఉన్నప్పుడు కూడా పెట్రోల్,డీజిల్ వంట గ్యాస్,ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో వుండేవని,ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్ రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచుతూ, కార్పొరేట్ కంపెనీ లకు మేలు చేస్తూ,ఈ కరొనా సమయం లో దేశ ప్రజలు,ఇబ్బందులు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ధరలు పెంచుతూ పేద మద్య తరగతి ప్రజల రక్తం తాగుతున్నాయన్నారు.ఈ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ అలపెరుగని పోరాటం చేస్తుందని,కేంద్రంలో సోనియాగాంధీ,రాహుల్ గాంధీ మరియు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు చమర గీతం పాడతామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఎన్ఎస్ యూఐ నాయకులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.
Post A Comment: